చైనాలో భారీ పేలుడు..10 మంది మృతి
- July 20, 2019చైనా:శుక్రవారం సాయంత్రం చైనాలోని ఓ గ్యాస్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మరణించగా,18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని, మరో 12 మంది గల్లంతయ్యారని చైనా మీడియా వాళ్ళు తెలియపరిచారు. ఈ ఘటన హెనన్ ప్రావిన్స్లోని యిమా పట్ణణంలోని హెనన్ కోల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్లోని ఎయిర్ సస్పెన్షన్ విభాగంలో పేలుడు సంభవించినట్లు చైనా అధికారిక మీడియా పేర్కొంది.
ఈ ప్రమాధం వళ్ల చుట్టూ ప్రక్కల మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లు తలపులు, అద్దాలు పగిలిపోయినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని చూసి అక్కడి ప్రజలంతా ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారని తెలియజేశారు.
బొగ్గు గనులు, గ్యాస్ ప్లాంట్లు, రసాయన పరిశ్రమలు ఉన్న చైనాలో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి.ఇటువంటి అత్యధిక పరిశ్రమలు ఉన్న చైనాలో భద్రతా ప్రమాణాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తారనే ఆరోపణ ఉంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ