మస్కట్ హోటల్లో అగ్ని ప్రమాదం: నలుగురికి గాయాలు
- July 22, 2019మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా నలుగురికి గాయాలయ్యాయి. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, గాయాలపాలైనవారిలో కొందరికి తీవ్రగాయాలు అయ్యాయని, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయనీ తెలుస్తోంది. మస్కట్ గవర్నరేట్లోని విలాయత్ బౌషర్లోగల ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగిందనీ, సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, మంటల్ని అదుపు చేయడం జరిగిందనీ, అందులో చిక్కుకుపోయినవారిని రక్షించామని అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి అత్యవసర వైద్య చికిత్స అందించి, అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగిందని అధికారులు వివరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ