మస్కట్ హోటల్లో అగ్ని ప్రమాదం: నలుగురికి గాయాలు
- July 22, 2019
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా నలుగురికి గాయాలయ్యాయి. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, గాయాలపాలైనవారిలో కొందరికి తీవ్రగాయాలు అయ్యాయని, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయనీ తెలుస్తోంది. మస్కట్ గవర్నరేట్లోని విలాయత్ బౌషర్లోగల ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగిందనీ, సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, మంటల్ని అదుపు చేయడం జరిగిందనీ, అందులో చిక్కుకుపోయినవారిని రక్షించామని అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి అత్యవసర వైద్య చికిత్స అందించి, అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగిందని అధికారులు వివరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







