మస్కట్ హోటల్లో అగ్ని ప్రమాదం: నలుగురికి గాయాలు
- July 22, 2019
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా నలుగురికి గాయాలయ్యాయి. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, గాయాలపాలైనవారిలో కొందరికి తీవ్రగాయాలు అయ్యాయని, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయనీ తెలుస్తోంది. మస్కట్ గవర్నరేట్లోని విలాయత్ బౌషర్లోగల ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగిందనీ, సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, మంటల్ని అదుపు చేయడం జరిగిందనీ, అందులో చిక్కుకుపోయినవారిని రక్షించామని అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి అత్యవసర వైద్య చికిత్స అందించి, అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగిందని అధికారులు వివరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..