నేడే ఏపీ గవర్నర్ ప్రమాణ స్వీకారం
- July 24, 2019
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా బిశ్వ భూషన్ హరిచందన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు ఉన్నతాధికారులు హాజారుకానున్నారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు రెండు విడతలుగా జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆపై ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్నం వరకూ ఉభయ సభలు వాయిదా పడనున్నాయి.
ఆపై నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఇందుకోసం మూడు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీరంతా వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తిరిగి అవే బస్సుల్లో సీఎంతో పాటు మిగతా వారంతా అసెంబ్లీకి చేరుకుంటారు. ఆపై మధ్యాహ్నం తరువాత ఉభయ సభల సమావేశాలు ప్రారంభం అవుతాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









