బుడతడుతో సరదాగా గడిపిన మోడీ
- July 24, 2019
బిజీ షెడ్యూల్లోనూ ప్రధాని మోదీ తన కోసం వచ్చిన చిన్నారి స్నేహితుడితో కాసేపు సరదాగా ఆడుకున్నారు. పార్లమెంట్లో మోదీ.. ఓ చిన్నారితో ఆడుతున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. చాలా ప్రత్యేకమైన స్నేహితుడు ఒకరు ఈ రోజు పార్లమెంటులో నన్ను కలుసుకున్నారు అనే క్యాప్షన్ ఇచ్చారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలు లక్షల్లో లైక్లతో తెగ వైరల్ అయ్యాయి.
మరోవైపు మోదీ చేతుల్లో బోసి నవ్వుల్ని చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ప్రయత్నం చేశారు. తొలుత మోదీని కలవడానికి వచ్చిన సందర్శకులకు సంబంధించిన వారి బిడ్డగా భావించారు. అయితే చివరకు ఆ బుడతడు ఎవరో తెలిసిపోయింది.
ప్రధాని చేతిలో ఎలాంటి బెరుకు లేకుండా ధీమాగా ఉన్న ఈ బుడతడు బీజేపీ ఎంపీ సత్యనారాయణ జతియా మనవడిగా తేలింది. మర్యాదపూర్వకంగానే మోదీని కలుసుకున్నట్లు ఎంపీ చెప్పారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







