లీష్ లేకుండా కుక్కతో వెళితే 5,000 జరీమానా
- July 24, 2019
అబుదాబీ: పెంపుడు కుక్కలకి మెడలో తాడు (లీష్) లేకుండా బయటకు తీసుకెళితే 5,000 దిర్హామ్ల జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చని అబుదాబీ మునిసిపాలిటీ హెచ్చరించింది. కాగా, డాగ్స్ని మాల్స్లోకీ అలాగే రెస్టారెంట్స్లోకీ అనుమతించబోరు. యానిమల్ వెల్ఫేర్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా ఈ రిమైండర్ని అబుదాబీ మునిసిపాలిటీ విడుదల చేసింది. పెట్ ఓనర్స్ మరియు డీలర్స్కి చట్టాల పట్ల అవగాణ కల్పించే కార్యక్రమాలు చేపడ్తున్నామని అబుదాబీ మునిసిపాలిటీ పబ్లిక్ సేఫ్టీ హెడ్ డాక్టర్ సయీద్ మొహమ్మద్ అల్ రుమైతి చెప్పారు. పెట్స్ని వీధుల్లో వదిలితే 2,000 దిర్హామ్ల వరకు జరీమానా విధిస్తారు. కొన్ని జాతులకు చెందిన ప్రాణుల అమ్మకాలపై నిషేధం వుందనీ, అలాంటివాటిని విక్రయిస్తే 10,000 వరకు జరీమానా తప్పదని అల్ రుమైతి పేర్కొన్నారు. కుక్కలు, పిల్లుల్ని మినహాయించి ఇతర జంతువుల్ని అనుమతి లేకుండా అపార్ట్మెంట్లు, విల్లాల్లో పెంచితే 5,000 వరకు జరీమానా తప్పదు. 18 ఏళ్ళ వయసులోపువారికి పెట్స్ అమ్మకం నిషేధం. ఉల్లంఘిస్తే 3,000 దిర్హామ్ల జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







