ఫేక్‌ మెయిల్స్‌కి స్పందించొద్దు: ఎంబసీ వార్నింగ్‌

- July 27, 2019 , by Maagulf
ఫేక్‌ మెయిల్స్‌కి స్పందించొద్దు: ఎంబసీ వార్నింగ్‌

యూఏఈ: ఉద్యోగార్థులు ఫేక్‌ మెయిల్స్‌ చూసి స్పందిస్తుంటారనీ, అలాంటి వాటి వల్ల మేలు జరగకపోగా కీడు జరుగుతోందని యూఏఈలో ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. అబుదాబీలోని ఓ సీబీఎస్‌ఈ స్కూల్‌లో ఉద్యోగాలంటూ కొందరు ఫ్రాడ్‌స్టర్స్‌ ఫేక్‌మెయిల్స్‌ పంపి, కొందర్ని మోసగించిన ఘటనపై ఇండియన్‌ ఎంబసీ స్పందించింది. డ్యూన్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ మరియు ప్రిన్సిపల్‌ పరమ్‌జిత్‌ అహ్లువాలియా మాట్లాడుతూ, కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఎవరూ పోగొట్టుకోకూడదని, ఫేక్‌ మెయిల్స్‌ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. కాగా, తమ స్కూల్‌ పేరు చెప్పి మోసాలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అహ్లువాలియా. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com