కొత్త రోడ్ రూల్: ఉల్లంఘనకు 10,000 దిర్హామ్ల జరీమానా
- July 27, 2019
అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అధికారికంగా టోల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ని ప్రకటించింది. క్యాపిటల్ నుంచి బయటకు వెళ్ళే క్రమంలో టోల్ గేట్స్ని దాటుకుని వెళ్ళేవారికి సరికొత్త టోల్ విధానం అందుబాటులోకి తెచ్చారు. నాలుగు డిఫరెంట్ లొకేషన్స్లో ఏర్పాటు చేసిన టోల్గేట్స్ అక్టోబర్ 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. కాగా, ఈ టోల్ గేట్ నుంచి పాస్ అయ్యే నాన్ రిజిస్టర్డ్ వెహికిల్కి తొలి రోజు 100 దిర్హామ్లు, రెండో రోజు 200 దిర్హామ్లు, మూడో రోజు 400 దిర్హామ్లు అత్యధికంగా 10,000 దిర్హామ్లు జరీమానా చెల్లించాల్సి వుంటుంది. తగినంత బ్యాలెన్స్ రిజిస్టర్డ్ వెహికిల్ అకౌంట్లో లేకుంటే, డెడ్లైన్ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత రోజుకి 50 దిర్హామ్లు జరీమానా విధించడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్ టాంపరింగ్కి 10,000 దిర్హామ్ల జరీమానా. ఇ-పేమెంట్ మెషీన్లకు డ్యామేజీ చేసేలా వాహనాలు నడిపినా 10,000 జరీమానా తప్పదు. అంబులెన్స్లు, ఆర్మ్డ్ ఫోర్సెస్ మరియు సివిల్ డిఫెన్స్ వాహనాలు, పబ్లిక్ బస్సులు, ట్యాక్సీలు (అబుదాబీలో లైసెన్స్ పొందినవి), స్కూల్ బస్సులు, పోలీస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాహనాలు, ట్రైలర్స్ మరియు మోటర్ సైకిల్స్ని టోల్ సిస్టమ్ నుంచి మినహాయించారు. రెండేళ్ళపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మినహాయింపు వుంటుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







