కర్నాటక రాజకీయం: స్పీకర్ సంచలన నిర్ణయం
- July 28, 2019
కర్నాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా రెబల్ ఎమ్మెల్యేలకు భారీ షాక్ ఇచ్చారు. మొత్తం 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఒక్కొక్కరు నాలుగేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ వేటు ఉంటుందని స్పీకర్ ప్రకటించడం గమనార్హం.
కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయి. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. రాజీనామాలను ఆమోదించకుండా ఎక్కువగా కాలం పెండింగ్లో పెట్టి ఇప్పుడు అనర్హత వేటు వేయడం సరికాదని సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అనర్హత వేటుకు గురైన వారిలో 11 మంది కాంగ్రెస్ వారు, ముగ్గురు జేడీఎస్ సభ్యులు ఉన్నారు.
వీరంతా బలపరీక్ష సందర్భంగా విప్ ధిక్కరించారన్న ఆరోపణలతో స్పీకర్ వేటు వేశారు. ఇది వరకే ముగ్గురిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఇప్పుడు మరో 14 మందిపై వేటు వేయడంతో మొత్తం 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినట్టు అయింది.
అయితే ఒక్కో ఎమ్మెల్యే నాలుగేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేయడం ఎంత వరకు నిలబడుతుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..