బోనాల సంబరాలతో వెలిగిపోతోన్న హైదరాబాద్
- July 28, 2019
హైదరాబాద్:బోనాల సంబరాలతో భాగ్యనగరం వెలిగిపోతోంది.. పాతబస్తీ ఆధ్మాత్మికశోభను సంతరించుకుంది. లాల్ దర్వాజ బోనాల జాతర సందడిగా సాగుతోంది. సింహవాహినిగా వేంచేసిన మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు.. భక్తుల మొక్కులు, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలతో పాతనగరం సందడిగా మారింది. మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు, నైవేద్యం సమర్పించేందుకు బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు..
అక్కన్న, మాదన్న దేవాలయాలతోపాటు అన్ని చోట్ల ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి.. అటు రేపు రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత భవానీ రథయాత్ర జరుగుతుంది.. మరోవైపు మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు.. ఓల్డ్ సిటీలో బోనాలకు జీహెచ్ఎంసీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







