బోనాల సంబరాలతో వెలిగిపోతోన్న హైదరాబాద్
- July 28, 2019
హైదరాబాద్:బోనాల సంబరాలతో భాగ్యనగరం వెలిగిపోతోంది.. పాతబస్తీ ఆధ్మాత్మికశోభను సంతరించుకుంది. లాల్ దర్వాజ బోనాల జాతర సందడిగా సాగుతోంది. సింహవాహినిగా వేంచేసిన మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు.. భక్తుల మొక్కులు, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలతో పాతనగరం సందడిగా మారింది. మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు, నైవేద్యం సమర్పించేందుకు బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు..
అక్కన్న, మాదన్న దేవాలయాలతోపాటు అన్ని చోట్ల ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి.. అటు రేపు రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత భవానీ రథయాత్ర జరుగుతుంది.. మరోవైపు మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు.. ఓల్డ్ సిటీలో బోనాలకు జీహెచ్ఎంసీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







