శబరిమల వెళ్లే తెలంగాణ యాత్రికులకు శుభవార్త

- January 06, 2016 , by Maagulf
శబరిమల వెళ్లే తెలంగాణ యాత్రికులకు శుభవార్త

శబరిమల వెళ్లే తెలంగాణ యాత్రికులకు అక్కడో భవన్‌ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. సీఎం కేసీఆర్ కృషి ఫలితం మేరకు నేడు ఇరు రాష్ర్టాల మధ్య ఎంఓయూ కుదిరింది. తెలంగాణ రాష్ట్ర యాత్రికుల కోసం కేరళ రాష్ర్టంలో ఐదు ఎకరాల్లో తెలంగాణ భవన్ నిర్మించనున్నారు. పంబా న‌ది సంగ‌మం వ‌ద్ద ఇవాళ జరిగిన కార్యక్రమంలో కేర‌ళ సీఎం ఉమెన్ చాందీతో తెలంగాణ ప్రభుత్వం త‌ర‌పున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఇవాళ ఉదయం కేర‌ళ రాష్ట్రానికి వెళ్లిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com