ట్రాఫికింగ్ బాధితులకోసం ఖతార్లో షెల్టర్ ఏర్పాటు
- August 01, 2019ఖతార్:ట్రాఫికింగ్ బాధితులుగా మారిన వలస కార్మికుల కోసం ఖతార్ నేషనల్ కమిటీ ఫర్ కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ (ఎన్సిసిహెచ్టి) 'హ్యూమన్ కేర్ సెంటర్'ని ప్రారంభించింది. ఈ సెంటర్ కార్మికులకు షెల్టర్గా మారుతుంది. అక్కడ వారికి అవసరమైన సహాయంతోపాటు, భద్రత కూడా కల్పిస్తారు. అల్ మామౌరాలో ఈ షెల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఆరు విల్లాలను షెల్టర్ కోసం కేటాయించారు. ఇందులో నాలుగు విల్లాలను హౌసింగ్కి మరో రెండు పబ్లిక్ సర్వీసుల కోసం వినియోగిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అలాగే ఎన్సిసిహెచ్టి సెక్రెటరీ మొహమ్మద్ హాసన్ అల్ ఒబైద్లీ మాట్లాడుతూ, ట్రాఫికింగ్ బాధితులకు తక్షణ రిలీఫ్ కింద ఈ షెల్టర్ ఉపయోగపడ్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం