దుబాయ్‌లో బస్‌ ప్రమాదం: బస్‌ డ్రైవర్‌కి బెయిల్‌

- August 01, 2019 , by Maagulf
దుబాయ్‌లో బస్‌ ప్రమాదం: బస్‌ డ్రైవర్‌కి బెయిల్‌

మస్కట్‌: దుబాయ్‌లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్‌కి బెయిల్‌ లభించింది. ఈ బస్సు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. రోడ్‌ బ్యారియర్‌ని బస్‌ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, రోడ్డు బ్యారియర్‌ నిబంధనలకు విరుద్ధంగా వుందని బస్‌ డ్రైవర్‌ తరఫున వాదనలు విన్పించారు న్యాయవాది. ఒమన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కి చెందిన మవసలాత్‌ బస్సు ఈ ప్రమాదానికి కారణమయ్యింది. ఎంబసీ ప్రయత్నాలు ఫలించి, డ్రైవర్‌కి బెయిల్‌ రావడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని వాదనలు న్యాయస్థానంలో విన్పించాయి బాధిత కుటుంబాలు, యూఏఈ ప్రభుత్వం.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com