లోక్సభలో ఆమోదం పొందిన కశ్మీర్ విభజన బిల్లు
- August 06, 2019
రాజ్యసభలో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్షా లోక్సభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దుపై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఉదయం 11 గంటలకు మొదలైన చర్చ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది.
ఈ బిల్లులకు ఇప్పటికే రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గెజిట్ కూడా విడుదల చేశారు. రాజ్యసభలో బిల్లుకు అనూకూలంగా 125, వ్యతిరేకంగా 61 ఓట్లు రావడంతో బిల్లులకు సభామోదం లభించింది. ఇప్పుడు జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లు లోక్సభలోనూ ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 351మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. దీంతో ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందినట్టయింది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







