అబుదాబీ పోర్ట్స్ కొత్త రికార్డు
- January 07, 2016
యూఏఈలోని ఖలీఫా ఇండస్ట్రియల్ జోన్, ప్రధాన పోర్టులను నిర్వహిస్తున్న అబుదాబీ పోర్ట్స్ 2015లో కార్గో వాల్యూమ్ పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అబుదాబీ టెర్మినల్స్ (అబుదాబీ పోర్ట్స్ సబ్సిడరీ సంస్థ) నిర్వహిస్తోన్న ఖలీఫా పోర్ట్ కంటెయినర్ టెర్మినల్ 2015లో 1,504,293 టియుఇ (ట్వంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్స్ / కంటెయినర్స్)ని మేనేజ్ చేసింది. 2014లో ఈ సంఖ్య 1,137,679 టియుఇలుగా ఉంది. 32 శాతం వృద్ధి కన్పించింది ఈ విభాగంలో.రోల్ ఆన్ రోల్ ఆఫ్ ట్రాఫిక్ 27 శాతం వృద్ధి చెందింది. 2015లో జాకెద్ పోర్ట్ నుంచి ఖలీఫా పోర్ట్కి ఈ రోల్ ఆన్ రోల్ ఆఫ్ ఆపరేషన్లు బదిలీ చేయబడ్డాయి. జనరల్ మరియు బల్క్ కార్గో 20 శాతం వృఇ్ధ నమోదు చేసింది. 15,310,847 మిలియన్ ఫ్రైట్ టన్స్ కార్గో అయ్యింది. గతంలో ఈ మొత్తం 12,804,248 మిలియన్ ఎఫ్టిగా ఉంది. అబుదాబీ క్రూయిజ్ ఇండస్ట్రీలో 16 శాతం పెరుగుదల కనిపించింది. జాయెద్లోని అబుదాబీ క్రూయిజ్ టెర్మినల్ ఇదే గ్రోత్ని ముందు ముందు కూడా కొనసాగింనుందనే అంచనాలున్నాయి. అబుదాబీ పోర్ట్స్ బిజినెస్, ఎమిరేట్ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో తమవంతు కృషి చేస్తున్నందుకు ఆనందంగా ఉందని సీఈఓ కెప్టెన్ మహమ్మద్ సుమా అల్ షమిసి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







