జయలలిత వాట్సాప్ ప్రచారం..రూ.50 కోట్లు ఖర్చు!

- January 07, 2016 , by Maagulf
జయలలిత వాట్సాప్ ప్రచారం..రూ.50 కోట్లు ఖర్చు!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా వాట్సాప్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల చెన్నై మహానగరాన్ని భారీ వరదలు ముంచెత్తిన విషయం తెల్సిందే. ఆ సమయంలో వరద బాధితులను కలుసుకునేందుకు వాట్సాప్ ద్వారా ప్రచారం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేసినట్టు విపక్ష పీఎంకే నేత డాక్టర్ రాందాస్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. రాందాస్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపింది. ఓ టెలికాం సంస్థ 70 శాతం వరకు రాయితీ కల్పించడం వల్ల వాట్సాప్‌ ప్రచారానికి రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని పేర్కొంది. వరద బాధితులను నేరుగా కలుసుకోవడం సాధ్యం పడని కారణంగా ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం అందుబాటులో వున్న సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నారని అధికారులు వివరణ ఇచ్చారు. ఈ వాస్తవాలను దాచి రాజకీయ లబ్ది కోసం పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com