రోజా ఇంటికి కేసీఆర్..షెడ్యూల్లో మార్పు
- August 12, 2019
తిరుపతి:తెలంగాణ సీఎం కేసీఆర్ రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సీఎంకు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, మిథన్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి దర్శనార్థం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నకేసీఆర్ రోడ్డు మార్గాన కంచికి బయలుదేరి వెళ్లారు. కంచికి వెళ్లేదారిలోని నగరిలో ఎమ్మెల్యే రోజా ఇంటికి చేరుకుని తేనీటి విందు స్వీకరిస్తారని తొలుత అనుకున్నారు. అయితే సమయాభావం వల్ల షెడ్యూల్లో చిన్నపాటి మార్పులు చేశారు. స్వామివారి దర్శనార్థం తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్ వెళ్తారని తెలిసింది. కేసీఆర్ కుటుంబానికి ఎమ్మెల్యే రోజా విందు ఏర్పాటు చేశారు. కంచి వరదరాజ స్వామి ఆలయం దర్శనానికి వెళ్తూ మార్గమధ్యలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్ వెళ్తారని అలాగే రోజా ఇంటిలో సీఎంకు ఉదయం 9 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం ఏర్పాట్లు చేస్తారని మొదట షెడ్యూల్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







