వరద బాధితులకు తనవంతు సాయం చేసిన సంపూర్ణేష్ బాబు.!
- August 13, 2019
సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం చిత్రంతో కామెడీ హీరోగా మారాడు. ఒకప్పుడు సంపూర్ణేష్ బాబుపై కామెడీ స్పూఫ్ లు చేసే హీరో అంటూ సెటైర్లు పడ్డాయి. కానీ ఇప్పుడు సంపూర్ణేష్ నటించిన సినిమాలు చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. సంపూర్ణేష్ బాబు బర్నింగ్ స్టార్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
సంపూర్ణేష్ బాబు స్టార్ హీరో కాకపోవచ్చు.. అతడి సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేయకపోవచ్చు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో, సాయం అందించడంలో పెద్ద మనసున్న హీరో అని సంపూర్ణేష్ మరోసారి నిరూపించుకున్నాడు. కర్ణాటకలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే 48మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందరో నిరాశ్రయులుగా మారారు.
కేంద్ర, రాష్ట్ర సహాయ బృందాలు సాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నాయి. కన్నడ, బాలీవుడ్ సినీ తారలు వరద బాధితుల్ని ఆదుకునేందుకు తమకు తోచిన విధంగా విరాళాలు అందిస్తున్నారు. టాలీవుడ్ నుంచి సంపూర్ణేష్ బాబు కర్ణాటక ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 లక్షల విరాళాన్ని ప్రకటించాడు.
కర్ణాటకలో వరదలు నన్ను కలచివేశాయి. కర్ణాటక ప్రజలు తెలుగు సినిమాని ఎప్పటినుంచో ఆదరిస్తున్నారు. నా చిత్రాలని కూడా వారు ప్రేమిస్తున్నారు. 2 లక్షలు వరద బాధితులకు సాయం ప్రకటిస్తున్నా అని సంపూర్ణేష్ ట్వీట్ చేశాడు. గతంలో తిత్లీ తుఫాను సమయంలో కూడా సంపూర్ణేష్ 50 వేలు విరాళం అందించాడు. సంపూర్ణేష్ నటించిన కొబ్బరి మట్ట చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.
కర్ణాటకలో వరదలకు దాదాపు 3వేల గ్రామాలు నీట మునిగాయి. 40 వేలకు పైగా ఇల్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, కేరళలో కూడా వరదలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







