చంద్రబాబు నాయుడు భద్రతపై హైకోర్టు కీలక తీర్పు
- August 14, 2019
టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు మొత్తం 97 మంది భద్రతాసిబ్బందిని కొనసాగించాలని ఆదేశించింది. సీఎస్ఓను ప్రభుత్వం నియమించవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఆయన కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలనీ ఆదేశాలు జారీ చేసింది. క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ విధులు ఎవరు నిర్వహించాలనే విషయంలో ఎన్ఎస్జీ, ఐఎస్ డబ్లూ కలిసి చర్చించుకోవాలని, మూడు నెలల్లోగా ఓ నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు 5 ప్లస్ 2 భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు భద్రతను భారీగా తగ్గించింది. అయితే ఉద్దేశపూర్వకంగానే తనకు భద్రత తగ్గించారంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై బుధవారం హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న హైకోర్టు తీర్పు వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఒక సీఎస్ వోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. కాన్వాయ్లో జామర్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. అయితే క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధుల నిర్వహణ తాము చూడలేమని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే అంశంలో ఎన్ఎస్జీ, ఐఎస్డబ్ల్యూ కలిసి చర్చించుకోవాలని తెలిపింది.
చంద్రబాబు భద్రత అంశంపై మూడు నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. చంద్రబాబుకు ప్రస్తుతం 74 మందితో భద్రత కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. తాజా కోర్టు తీర్పుతో ఆ సంఖ్య 97కు పెరగనుంది. దీంతో టీడీపీ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







