మోదీపై ధ్వజమెత్తిన ఇమ్రాన్
- August 16, 2019
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై తన అక్కసును వెళ్లగక్కారు. జమ్మూకశ్మీర్ విషయంలో ప్రధాని మోడి నేతృత్వంలోని హిందుత్వ మూకలు అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలు విఫలమవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ ప్రపంచంలో సైన్యాలు, మిలిటెంట్లు, ఉగ్రవాదులను అంతకంటే బలమైన శక్తి అణచివేయగలదని చెప్పారు. కానీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడే ప్రజలు చావుకు భయపడరని స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలో ఏ శక్తీ వాళ్లను తమ లక్ష్యానికి చేరుకోకుండా అడ్డుకోలేదని అన్నారు. ఈ విషయాన్ని హిందుత్వ విధానాలకు వకల్తా పుచ్చుకున్న ఫాసిస్ట్ మోడి అర్థం చేసుకోవాలని సూచించారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం రాష్ట్రాన్ని లడఖ్, జమ్మూకశ్మీర్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయంపైనే ఇమ్రాన్ తన అక్కసును మళ్లీ వెళ్లగక్కారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







