మోదీపై ధ్వజమెత్తిన ఇమ్రాన్
- August 16, 2019పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై తన అక్కసును వెళ్లగక్కారు. జమ్మూకశ్మీర్ విషయంలో ప్రధాని మోడి నేతృత్వంలోని హిందుత్వ మూకలు అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలు విఫలమవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ ప్రపంచంలో సైన్యాలు, మిలిటెంట్లు, ఉగ్రవాదులను అంతకంటే బలమైన శక్తి అణచివేయగలదని చెప్పారు. కానీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడే ప్రజలు చావుకు భయపడరని స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలో ఏ శక్తీ వాళ్లను తమ లక్ష్యానికి చేరుకోకుండా అడ్డుకోలేదని అన్నారు. ఈ విషయాన్ని హిందుత్వ విధానాలకు వకల్తా పుచ్చుకున్న ఫాసిస్ట్ మోడి అర్థం చేసుకోవాలని సూచించారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం రాష్ట్రాన్ని లడఖ్, జమ్మూకశ్మీర్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయంపైనే ఇమ్రాన్ తన అక్కసును మళ్లీ వెళ్లగక్కారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం