ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
- August 18, 2019ఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్లో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో రోగులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలు అదుపుచేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఆస్పత్రి వద్ద పొగలు వ్యాపించడంతో అంతా భయంతో పరుగులు తీశారు. ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఏడు నుంచి ఎనిమిది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోగా.. సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తొలి అంతస్తులో ప్రమాదం జరగ్గా.. రెండో అంతస్తు దాకా పొగలు వ్యాపించాయి. బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్లోనే చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆయన వేరే భవనంలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!