ఫుడ్ సేఫ్టీ చట్టానికి ఖలీఫా ఆమోదం
- January 07, 2016
ఫుడ్ సేఫ్టీ చట్టానికి ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆమోదం తెలిపారు. జులై 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్ట ప్రకారం ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని ఉల్లంఘించినవారికి మూడేళ్ళ వరకు జైలు శిక్ష మరియు 2 మిలియన్ దిర్హామ్ల ఫైన్ విధించబడ్తుంది. ఫెడరల్ కౌన్సిల్లో గత సంవత్సరం పాస్ అయిన ఈ శాసనం, పబ్లిక్ హెల్త్ కోసం ఉద్దేశించబడినది. నిబంధనలకు విరుద్ధంగా తయారవుతున్న ఆహార పదార్థాల కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడ్తున్నారనీ, అలాగే మరణాలు కూడా సంభవిస్తున్నాయనీ, ఈ నేపథ్యంలోనే ఈ చట్టాన్ని తెచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. యూఏఈ 80 శాతం ఆహార పదార్థాల్ని ఇంపోర్ట్ చేసుకుంటోంది. దాంతో, ఇంపోర్ట్ అవుతున్న ఆహార పదార్థాలు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే తయారవ్వాల్సి ఉంది. గత సంవత్సరం 10 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు ఇంపోర్ట్ అవగా కేవలం 3 శాతం మాత్రమే తిరస్కరణకు గురయ్యానీ, అవి కూడా లేబెలింగ్ సమస్య కారణంగానేనని ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ మినిస్టర్ డాక్టర్ రషీద్ అహ్మద్ బిన్ ఫహాద్ చెప్పారు. చట్టంలో పేర్కొనబడ్డ ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ పర్మిషన్ లేకుండా కొత్తగా ఎలాంటి ఆహార పదార్థాల దిగుమతిని అనుమతించరు. పోర్క్ లేదా ఆల్కహాల్ కలిగి ఉన్న ఆహార పదార్థాలు అనుమతి లేకుండా ఇంపోర్ట్ చేసినట్లయితే ఒక నెల జైలు శిక్ష, 500,000 దిర్హామ్ల ఫైన్ విధిస్తారు. ఆహార పదార్థాల ప్యాకేజింగ్పై తప్పుడు వివరాలు ఉంటే 10,000 నుంచి 100,000 దిర్హామ్ల ఫైన్ విధించబడ్తుంది.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







