హాంగ్కాంగ్లో గొడుగులతో వేలాది మంది జనం
- August 19, 2019
హాంకాంగ్ : వేలాది మంది ప్రజాస్వామిక వాదులు హాంగ్కాంగ్లో ఆదివారం భారీ ప్రదర్శనకు తరలివెళ్లారు. భారీ వర్షం నుంచి రక్షణగా గొడుగు లు ధరించి వారు మహానగరంలోని ప్రధాన వీధి మీదుగా మహా ప్రదర్శనకు దిగారు. చైనా ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ హాంగ్కాంగ్లో ఈ వేసవిలో వారాంతపు నిరసనలు సాధారణం అయ్యాయి. తొలుత వేలాది మంది ప్రదర్శకులు స్థానిక విక్టోరియా పార్క్ లో చేరారు. ఎంతకూ ఆగని వానను లెక్కచేయకుండా ఆ తరువాత ప్రదర్శనగా సాగారు. తామంతా శాంతియు త ప్రదర్శనగా వెళ్లుతామని, తమ హక్కులసాధనకు నినదిస్తామని నిర్వాహకులు తెలిపారు. నెలల తరబడి ఇక్కడ ఉద్య మం సాగుతోంది, తరచూ పోలీసులతో తలపడు తూ సాగిన ప్రదర్శనలు ఈ వారాంతంలో అందు కు విరుద్ధంగా అత్యంత ప్రశాంతతో క్రమశిక్షణ తో ముందుకు సాగింది. ఘర్షణాయుత వాతావరణం ఉండబోదనే తాము భావిస్తున్నట్లు ఉద్యమ నిర్వాహకులలో ఒకరైన బోనీ లియూంగ్ తెలిపా రు. ఇక్కడి వారు శాంతిప్రియలు అనే విషయం ప్రపంచానికి తెలిసివస్తుందని చెప్పారు. వేలాది గొడుగుల నీడలో జనం అంతా కెరటాలుగా తరలివెళ్లుతూ ఉండటంతో హాంగ్కాంగ్లో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. జూన్ నుంచి లియూంగ్ వర్గం వారు పౌర హక్కుల కూటమిగా ఏర్పడి ఇప్పటికీ మూడు బ్రహ్మండమైన ప్రదర్శనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..