హాంగ్కాంగ్లో గొడుగులతో వేలాది మంది జనం
- August 19, 2019
హాంకాంగ్ : వేలాది మంది ప్రజాస్వామిక వాదులు హాంగ్కాంగ్లో ఆదివారం భారీ ప్రదర్శనకు తరలివెళ్లారు. భారీ వర్షం నుంచి రక్షణగా గొడుగు లు ధరించి వారు మహానగరంలోని ప్రధాన వీధి మీదుగా మహా ప్రదర్శనకు దిగారు. చైనా ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ హాంగ్కాంగ్లో ఈ వేసవిలో వారాంతపు నిరసనలు సాధారణం అయ్యాయి. తొలుత వేలాది మంది ప్రదర్శకులు స్థానిక విక్టోరియా పార్క్ లో చేరారు. ఎంతకూ ఆగని వానను లెక్కచేయకుండా ఆ తరువాత ప్రదర్శనగా సాగారు. తామంతా శాంతియు త ప్రదర్శనగా వెళ్లుతామని, తమ హక్కులసాధనకు నినదిస్తామని నిర్వాహకులు తెలిపారు. నెలల తరబడి ఇక్కడ ఉద్య మం సాగుతోంది, తరచూ పోలీసులతో తలపడు తూ సాగిన ప్రదర్శనలు ఈ వారాంతంలో అందు కు విరుద్ధంగా అత్యంత ప్రశాంతతో క్రమశిక్షణ తో ముందుకు సాగింది. ఘర్షణాయుత వాతావరణం ఉండబోదనే తాము భావిస్తున్నట్లు ఉద్యమ నిర్వాహకులలో ఒకరైన బోనీ లియూంగ్ తెలిపా రు. ఇక్కడి వారు శాంతిప్రియలు అనే విషయం ప్రపంచానికి తెలిసివస్తుందని చెప్పారు. వేలాది గొడుగుల నీడలో జనం అంతా కెరటాలుగా తరలివెళ్లుతూ ఉండటంతో హాంగ్కాంగ్లో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. జూన్ నుంచి లియూంగ్ వర్గం వారు పౌర హక్కుల కూటమిగా ఏర్పడి ఇప్పటికీ మూడు బ్రహ్మండమైన ప్రదర్శనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







