రక్తమోడుతున్న ఆఫ్గనిస్తాన్..ప్రపంచ దేశాలను సాయం అర్ధిస్తున్న అధ్యక్షుడు
- August 20, 2019
ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్లో ఇవాళ ఆరు చోట్ల పేలుళ్లు జరిగాయి. రెస్టారెంట్లు, పబ్లిక్ ప్రాంతాల్లో ఆ ఘటనలు చేసుకున్నాయి. ఆ పేలుళ్లలో సుమారు 66 మంది పౌరులు గాయపడ్డారు. బ్రిటీష్ పాలన నుంచి స్వాత్రంత్య్రం పొంది వందేళ్లు అయిన నేపథ్యంలో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో వేడుకలు జరుగుతున్నాయి. అయితే నాన్ఘర్ ప్రావిన్సులోని జలాలాబాద్ సిటీలో ఇవాళ ఆరు ప్రాంతాల్లో పేలుడు ఘటనలు జరిగాయి. ఐ-డే ఈవెంట్లను టార్గెట్ చేస్తూ జరిగిన పేలుళ్లలో 34 మంది గాయపడినట్లు గవర్నర్ షా మొహబూద్ చెప్పారు. ఈ దాడులకు బాధ్యత ఎవరూ ప్రకటించుకోలేదు. రెండు రోజుల క్రితమే కాబూల్లో ఓ పెళ్లి వేడుకలో జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 63 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రపంచ దేశాల సాయాన్ని కోరారు. మిలిటెంట్ల ఏరివేతకు అంతర్జాతీయ దేశాలు సహకరించాలన్నారు. ఐఎస్కు సంబంధించిన దయిస్ను తరిమేందుకు పోరాటం చేస్తామన్నారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







