రాజశేఖర్ మరోసారి థ్రిల్ సినిమా చేస్తారట
- August 19, 2019
'గరుడవేగ' సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చేశారు సీనియర్ నటుడు రాజశేఖర్. ఐతే, ఆ తర్వాత ఆయన నటించిన కల్కీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఈసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఎంచుకొంటారని అందరూ భావించారు. కానీ, ఆయన మరోసారి థ్రిల్లర్ కథని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. 'బేతాళుడు' చిత్రంలో విజయ్ ఆంటోనీని డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇదో ఎమోషనల్ థ్రిల్లర్ అని తెలిసింది. ఓ నవల ఆధారంగా కథని రెడీ చేసుకొన్నారట. ఈ చిత్రంలో నాజర్, సత్యరాజ్, బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు. క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ బ్యానర్ లో ధనుంజయన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







