నేడు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. రేసులో కోటా శ్రీనివాస్, కరుణాకర్రెడ్డి
- August 20, 2019
కర్ణాటకలో మంత్రివర్గ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇవాళ యడియూరప్ప కేబినెట్ కొలువు దీరే అవకాశముంది. కొత్త మంత్రివర్గంలో 18 నుంచి 20 మందిని తీసుకోనున్నారు. లింగాయత్, ఒక్కళిగ, ఎస్సీ-ఎస్టీ, కురుబ, బ్రాహ్మణ, బిల్లవ వర్గాలకు కేబినెట్లో చోటు కల్పించనున్నారు. లింగాయత్ వర్గానికి 5 మంత్రి పదవులు కేటాయించనున్నారు. మరో ప్రధాన వర్గం ఒక్కళిగలకు 4 కేబినెట్ పోస్టులు లభించ నున్నాయి. ఎస్సీ-ఎస్టీలకు చెరో మూడు మంత్రి పదవులు ఇచ్చే అవకాశముంది. కురుబ, బ్రాహ్మణ, బిల్లవ కులాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.
మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి ఆశావహులు పోటీపడుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కేఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక్, జగదీశ్ శెట్టర్, వి.సోమణ్ణ, గోవింద కారజోళ, జేసీ మాధుస్వామి, బి.శ్రీరాములు, ఉమేశ్ కత్తి, డాక్టర్ అశ్వర్థనారాయణ్, శశికళా జొల్లె, రేణుకాచార్య, సీటీ రవి, బాలచంద్ర జార్కిహో ళి, శివనేగౌడనాయక్, అంగార, బోపయ్య, కోటా శ్రీనివాసపూజారి, జి.కరుణాకర్రెడ్డిలకు తొలివిడతలో మంత్రులుగా అవకాశం ఇస్తారని సమాచారం.
ప్రభుత్వం ఏర్పాటై 3 వారాలు గడుస్తున్నా ఇంకా మంత్రివర్గం జాడే లేదంటూ బీజేపీపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వీటికి చెక్ పెట్టడంపై కమలదళం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి యడియూరప్ప, కేబినెట్ ఏర్పాటులో తలమునకలయ్యారు. ఇప్పటికే ఓసారి పార్టీ అధినాయకత్వంతో చర్చించిన యడ్డీ, మరోసారి పార్టీ హైకమాండ్తో సంప్రదింపులు జరపనున్నారు. మంత్రివర్గంలోకి తీసుకోబోయేవారి పేర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తొలి విడతలో 20 మందికి స్థానం కల్పించినా, ఇంకా 13 ఖాళీగా ఉంటాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఆ 13 స్థానాలను కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







