ట్రంప్ కు కాల్ చేసిన మోడీ..పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఇరు నేతల చర్చ
- August 20, 2019
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సోమవారం ఫోన్లో మాట్లాడారు. కొందరు ప్రాంతీయ స్థాయి నేతలు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రేలాపనలకు దిగుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలను పరోక్షంగా ప్రస్తావించారు. కశ్మీర్పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న తరువాత ట్రంప్తో మోడీ ఫోన్ సంభాషణ ప్రాధాన్యతను సంతరించుకుంది.
కొందరు ప్రాంతీయ నేతలు భారతదేశంపై దాడులు జరగాలనే రీతిలో హింసాత్మక వ్యాఖ్యలకు దిగుతున్నారని ప్రధాని మోడీ ట్రంప్తో చెప్పారు. శాంతియుత వాతావరణానికి ఇటువంటి వైఖరి సరైనది కాదని తెలిపారు. అమెరికా అధ్యక్షులతో ప్రధాని మోడీ అరగంట సేపు ఫోన్ సంభాషణ జరిపారని, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలను ప్రస్తావించారని ఆ తరువాత ప్రధాన మంత్రి కార్యాలయం వారు ఒక ప్రకటన వెలువరించారు. చాలా సృహద్భావ, ఆత్మీయల సూచకంగా సంభాషణ సాగిందని తెలిపారు. ఇరు దేశాల నేతల మధ్య ఉన్న సత్సంబంధాలు ఈ సందర్భంగా స్పష్టం అయ్యాయని వివరించారు. ఈ ప్రాంతంలో కొందరు మాట్లాడుతున్న తీరు శృతి మించుతోందని, ఇది సమస్యలను జటిలం చేసి, శాంతిని దెబ్బతీస్తుందని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద రహితంగా, భయాందోళనలకు తావులేని విధంగా సవ్యమైన వాతావరణం ఉండాలనేదే భారతదేశ అభిమతం అని మోడీ స్పష్టం చేశారు. కాగా పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధుల నిర్మూలనలు వంటి కార్యక్రమాల దిశలో సవ్యమైన రీతిలో పాటుపడే వారితో భారతదేశం ఎల్లవేళలా సహకరిస్తుందని, ఇందుకు కట్టుబడి ఉంటామని ప్రధాని ఈ సందర్భంగా ట్రంప్తోచెప్పినట్లు ప్రధాని కార్యాలయం వారు తమ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







