హిమాచల్ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న ప్రముఖ నటి మంజు వారియర్
- August 20, 2019
హిమాచల్ప్రదేశ్: మలయాళ చిత్రసీమకు చెందిన ప్రముఖ నటి మంజు వారియర్ హిమాచల్ప్రదేశ్ వరదల్లో చిక్కుకుంది. షూటింగ్ కోసం వెళ్లిన ఆమె చిత్ర బృందంతో కలిసి వరదల్లో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని ఆమె తన సోదరుడికి ఫోన్ ద్వారా తెలియజేసింది. అలాగే, విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ దృష్టికి తీసుకెళ్లింది.
సినిమా చిత్రీకరణలో భాగంగా నటి మంజు సహా 30 మంది సిబ్బంది మనాలీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చత్రకు వెళ్లారు. మూడువారాలుగా వారు అక్కడే షూటింగ్ చేస్తున్నారు. వరదల కారణంగా వారు అక్కడే చిక్కుకుపోగా నటి మంజు వారియర్.. కేంద్రమంత్రి వి.మురళీధరన్ను సంప్రదించి సాయం కోసం అర్థించింది. ఆయన విషయాన్ని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారిని రక్షించాల్సిందిగా కోరారు. ఆ వెంటనే మండి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. వారు తక్షణం సహాయక చర్యలు చేపట్టి చిత్ర బృందాన్ని రక్షించారు. వారిని రక్షించినట్టు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!







