హిమాచల్ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న ప్రముఖ నటి మంజు వారియర్
- August 20, 2019
హిమాచల్ప్రదేశ్: మలయాళ చిత్రసీమకు చెందిన ప్రముఖ నటి మంజు వారియర్ హిమాచల్ప్రదేశ్ వరదల్లో చిక్కుకుంది. షూటింగ్ కోసం వెళ్లిన ఆమె చిత్ర బృందంతో కలిసి వరదల్లో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని ఆమె తన సోదరుడికి ఫోన్ ద్వారా తెలియజేసింది. అలాగే, విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ దృష్టికి తీసుకెళ్లింది.
సినిమా చిత్రీకరణలో భాగంగా నటి మంజు సహా 30 మంది సిబ్బంది మనాలీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చత్రకు వెళ్లారు. మూడువారాలుగా వారు అక్కడే షూటింగ్ చేస్తున్నారు. వరదల కారణంగా వారు అక్కడే చిక్కుకుపోగా నటి మంజు వారియర్.. కేంద్రమంత్రి వి.మురళీధరన్ను సంప్రదించి సాయం కోసం అర్థించింది. ఆయన విషయాన్ని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారిని రక్షించాల్సిందిగా కోరారు. ఆ వెంటనే మండి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. వారు తక్షణం సహాయక చర్యలు చేపట్టి చిత్ర బృందాన్ని రక్షించారు. వారిని రక్షించినట్టు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







