హిమాచల్ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న ప్రముఖ నటి మంజు వారియర్
- August 20, 2019హిమాచల్ప్రదేశ్: మలయాళ చిత్రసీమకు చెందిన ప్రముఖ నటి మంజు వారియర్ హిమాచల్ప్రదేశ్ వరదల్లో చిక్కుకుంది. షూటింగ్ కోసం వెళ్లిన ఆమె చిత్ర బృందంతో కలిసి వరదల్లో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని ఆమె తన సోదరుడికి ఫోన్ ద్వారా తెలియజేసింది. అలాగే, విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ దృష్టికి తీసుకెళ్లింది.
సినిమా చిత్రీకరణలో భాగంగా నటి మంజు సహా 30 మంది సిబ్బంది మనాలీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చత్రకు వెళ్లారు. మూడువారాలుగా వారు అక్కడే షూటింగ్ చేస్తున్నారు. వరదల కారణంగా వారు అక్కడే చిక్కుకుపోగా నటి మంజు వారియర్.. కేంద్రమంత్రి వి.మురళీధరన్ను సంప్రదించి సాయం కోసం అర్థించింది. ఆయన విషయాన్ని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారిని రక్షించాల్సిందిగా కోరారు. ఆ వెంటనే మండి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. వారు తక్షణం సహాయక చర్యలు చేపట్టి చిత్ర బృందాన్ని రక్షించారు. వారిని రక్షించినట్టు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..