హిమాచల్‌ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న ప్రముఖ నటి మంజు వారియర్

- August 20, 2019 , by Maagulf
హిమాచల్‌ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న ప్రముఖ నటి మంజు వారియర్

హిమాచల్‌ప్రదేశ్: మలయాళ చిత్రసీమకు చెందిన ప్రముఖ నటి మంజు వారియర్ హిమాచల్‌ప్రదేశ్ వరదల్లో చిక్కుకుంది. షూటింగ్ కోసం వెళ్లిన ఆమె చిత్ర బృందంతో కలిసి వరదల్లో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని ఆమె తన సోదరుడికి ఫోన్ ద్వారా తెలియజేసింది. అలాగే, విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ దృష్టికి తీసుకెళ్లింది.

సినిమా చిత్రీకరణలో భాగంగా నటి మంజు సహా 30 మంది సిబ్బంది మనాలీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చత్రకు వెళ్లారు. మూడువారాలుగా వారు అక్కడే షూటింగ్ చేస్తున్నారు. వరదల కారణంగా వారు అక్కడే చిక్కుకుపోగా నటి మంజు వారియర్.. కేంద్రమంత్రి వి.మురళీధరన్‌ను సంప్రదించి సాయం కోసం అర్థించింది. ఆయన విషయాన్ని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారిని రక్షించాల్సిందిగా కోరారు. ఆ వెంటనే మండి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. వారు తక్షణం సహాయక చర్యలు చేపట్టి చిత్ర బృందాన్ని రక్షించారు. వారిని రక్షించినట్టు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com