దుబాయ్లో పాకిస్తానీ క్రికెటర్తో ఇండియన్ ఇంజనీర్ పెళ్ళి
- August 21, 2019
పాకిస్తానీ క్రికెటర్ హసన్ అలీ వివాహం ఇండియన్ ఏరోనాటికల్ ఇంజనీర్ సమియా అర్జూతో జరిగింది. దుబాయ్లో ఈ వివాహం జరగగా, కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. అట్లాంటిస్ - ది పామ్ వద్ద ఈ వివాహం జరిగింది. అలీ - అర్జూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా, అర్జూ దుబాయ్లో నివసిస్తున్నారు. ఆమె ఎయిర్ హోస్టెస్గా విధులు నిర్వహిస్తున్నారు. క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా అర్జూ, హసన్ అలీ మధ్య ప్రేమ చిగురించింది. పెళ్ళిలో ఇండియన్ లుక్తో కన్పించిన అర్జూ, రిసెప్షన్లో పాకిస్తానీ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. పాకిస్తాన్లో వీరిద్దరి వివాహ రిసెప్షన్ జరగనుంది.
తాజా వార్తలు
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష







