ఘనంగా శిల్పకళా వేదికలో మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు
- August 21, 2019హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అభిమానుల కోసం ప్రత్యేకించి డ్యాన్సులు, పాటల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ అండ్ గాయనీగాయకుల టీమ్ చిరు క్లాసిక్ మెడ్లీ పాటలతో మైమరిపించారు. జబర్దస్త్ టీమ్ సరదా పార్టిసిపేషన్ ఆకట్టుకుంది. ముఠా మేస్త్రి ల్యాండ్ మార్క్ స్టెప్పులతో జబర్దస్త్ కమెడియన్లు ఆకట్టుకున్నారు. సత్య మాస్టర్ మెడ్లీ డ్యాన్స్ పెర్ఫామెన్స్ మైమరిపించింది. నిర్మాత కం ఎగ్జిబిటర్ ప్రతాని రామకృష్ణ గౌడ్.. 10వ తరగతిలో మంచి మార్కులు పొందిన విద్యార్థులను సన్మానించారు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్,మెగా స్టార్ ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..