ఘనంగా శిల్పకళా వేదికలో మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు
- August 21, 2019
హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అభిమానుల కోసం ప్రత్యేకించి డ్యాన్సులు, పాటల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ అండ్ గాయనీగాయకుల టీమ్ చిరు క్లాసిక్ మెడ్లీ పాటలతో మైమరిపించారు. జబర్దస్త్ టీమ్ సరదా పార్టిసిపేషన్ ఆకట్టుకుంది. ముఠా మేస్త్రి ల్యాండ్ మార్క్ స్టెప్పులతో జబర్దస్త్ కమెడియన్లు ఆకట్టుకున్నారు. సత్య మాస్టర్ మెడ్లీ డ్యాన్స్ పెర్ఫామెన్స్ మైమరిపించింది. నిర్మాత కం ఎగ్జిబిటర్ ప్రతాని రామకృష్ణ గౌడ్.. 10వ తరగతిలో మంచి మార్కులు పొందిన విద్యార్థులను సన్మానించారు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్,మెగా స్టార్ ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







