'పహిల్వాన్' ట్రైలర్ వివిడుదలకు సిద్ధం
- August 21, 2019
కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఇప్పుడు మల్టీలాంగ్వేజ్ నటుడుగా మారుతున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు లో ఎస్ ఎస్ రాజమౌళి -నాని కాంబినేషన్ లో వచ్చిన 'ఈగ'సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. ఈ సినిమాలో ఈగతో విలన్ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు..సీరియస్, కామెడీ ఇలా ఎన్నో వేరియేషన్స్ తో మెప్పించాడు సుదీప్. వాస్తవానికి ఈ మూవీలో నాని హీరో అయినప్పటికీ కొద్దసేపు మాత్రమే కనిపిస్తాడు. ఫుల్ లెన్త్ నటన సుదీప్ తోనే సాగుతుంది.
ఈ మూవీలో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన 'బాహుబలి' సినిమాలో నటించాడు. తాజాగా మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' మూవీలో కూడా సుదీప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తానికి కన్నడలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సుదీప్ మిగతా భాషల పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే విలన్ గా చేస్తూ తన స్థాయిని పెంచుకుంటున్నాడు. ప్రసుతం తాను అన్ని భాషల్లో నటిస్తున్నాడు కనుక తాను నటించే సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నాడు సుదీప్.
యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన పహిల్వాన్ సినిమాను కన్నడతో పాటు తెలుగు తమిళ్ హిందీ మలయాళం బాషాల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. క్రేజ్ ఉన్న మూమెంట్ లో గురువారం అన్ని భాషల ప్రజలను ట్రైలర్ తో టచ్ చేయడానికి సిద్దమయ్యాడు. ఆ మద్య ఈ మూవీకి సంబంధించి కన్నడ ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు లో పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగులో గురువారం అన్ని భాషల ప్రజలను ట్రైలర్ తో టచ్ చేయడానికి సిద్దమయ్యాడు. కాగా, పహిల్వాన్ సినిమాలో సుదీప్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. కన్నడలో లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎస్ కృష్ణా తెరకెక్కించిన ఈ సినిమాను స్వప్న కృష్ణ నిర్మించారు.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







