దుబాయ్కి విమాన సర్వీసుల్ని ప్రారంభించిన విస్తారా
- August 22, 2019
భారతదేశానికి చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ ముంబై మరియు దుబాయ్ మధ్య డైలీ సర్వీస్లను ప్రారంభించింది. విస్తారాకి ఇది రెండో అంతర్జాతీయ డెస్టినేషన్ కావడం గమనార్హం. ముంబై నుంచి ఆగస్ట్ 21న బయల్దేరిన విస్తారా తొలి విమానం, దుబాయ్కి 6 గంటలకు చేరుకుంది. ముంబై నుంచి సాయంత్రం 4.25 నిమిషాలకు బయల్దేరే విమానం, దుబాయ్కి సాయంత్రం 6.15 నిమిషాలకు చేరుకుంటుంది. దుబాయ్ నుంచి 7.15 నిమిషాలకు ప్రారంభమై ముంబైకి 12.15 నిమిషాలకు చేరుకుంటుంది. బిజినెస్, ఎకానమీ క్లాస్తోపాటు ప్రీమియమ్ ఎకానమీ క్లాస్లో తాము విమాన సర్వీసుల్ని అందిస్తున్నట్లు విస్తారా వెల్లడించింది. ఇదిలా వుంటే, తమ మూడో అంతర్జాతీయ డెస్టినేషన్ అయిన బ్యాంకాక్కి ఈ నెల 27న విమాన సర్వీస్ ప్రారంభించనుంది విస్తారా.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









