రేపు హైదరాబాద్‌ రానున్న పీవీ సింధు

- August 26, 2019 , by Maagulf
రేపు హైదరాబాద్‌ రానున్న పీవీ సింధు

హైదరాబాద్‌: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ తార పీవీ సింధు మంగళవారం హైదరాబాద్‌కు రానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె నగరానికి చేరుకుంటుందని సమాచారం. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్విట్జర్లాండ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. సింధు రాక కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో  రెండేళ్ల క్రితం తనకు స్వర్ణం దూరం చేసిన జపాన్‌ క్రీడాకారిణి నొజొమి ఒకుహరను సింధు 21-7, 21-7 తేడాతో వరుస గేముల్లో చిత్తుగా ఓడించింది. దూకుడుగా ఆడింది. తన పదునైన స్మాష్లతో విరుచుకుపడింది. ఛాంపియన్‌షిప్‌లో సింధు ఇంతకు ముందు 2 కాంస్యాలు, 2 రజతాలు గెలుచుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తదితరులు ఆమెకు అభినందనలు తెలియజేశారు. భారత బ్యాడ్మింటన్‌ సంఘం రూ.5 లక్షల బహుమానంగా ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com