సౌదీ అరేబియా లో ఒకేసారి 23 మందికి మరణశిక్ష..
- August 26, 2019సౌదీ అరేబియా:డ్రగ్స్ సంబంధిత నేరాలలో జైలుశిక్షను అనుభవిస్తున్న 23 మంది నైజీరియన్లను ఏ క్షణానైనా సౌదీలో ఉరితీసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.సౌదీ అరేబియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. సౌదీ అరేబియా చట్టాల ప్రకారం డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసినా..ఇతర కార్యకలాపాలకు పూనుకున్నా కఠిన శిక్షలు విధిస్తారు.2016 నుంచి 2017 మధ్యలో కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జెడ్డా అండ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ అబ్దు అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తదితర ప్రదేశాలలో డ్రగ్స్ సంబంధిత నేరాలలో చాలా మంది అరెస్ట్ అయ్యారు. జెడ్డాలో 1,183 గ్రాముల కొకైన్తో పట్టుబడిన కుదిరత్ అఫోలబీ, సహాద్ సోబేడ్ అనే ఇద్దరు నైజీరియన్లకు ఇప్పటికే ఉరిశిక్షను విధించినట్టు సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. ఇప్పుడు మరో 23 మంది నైజీరియన్లకు ఏ క్షణానైనా శిరచ్చేధం లేదా ఉరిశిక్ష విధించే అవకాశమున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక