కశ్మీర్ అభివృద్ధిపై ప్రత్యేక బృందం ఏర్పాటు...ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు
- August 28, 2019
దిల్లీ: కశ్మీర్ అభివృద్ధిపై మంత్రులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, థావర్సింగ్ గహ్లోత్, జితేందర్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్, ధర్మేంద్ర ప్రధాన్ ఈ బృందంలో ఉన్నారు. కశ్మీర్ అభివృద్ధిపై మంత్రుల బృందం బ్లూప్రింట్తో రావాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్ అభివృద్ధిపై వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, ఏ మంత్రిత్వ శాఖ ఎలా పనిచేస్తుందో అనే వివరాలతో కూడిన బ్లూప్రింట్తో రావాలని బృందానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 31లోపు సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రం పేర్కొంది. మంత్రుల బృందం సమర్పించే నివేదిక ఆధారంగా ప్రధాని కశ్మీర్కు మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువత నైపుణ్యాభివృద్ధిపై ఇప్పటికే మంత్రుల బృందం రెండుసార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!