నేడు రాజధానిలో పవన్ పర్యటన
- August 30, 2019అమరావతి:రాజధాని అమరావతిలో శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాజధానిపై మంత్రి బొత్స చేసిన ప్రకటనలపై రాజధాని రైతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లో పవన్ని కలసి సమస్యను వివరించారు. రెండు రోజులు రాజధానిలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని పవన్ రాజధాని రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు మంగళగిరిలో బయలుదేరి నవులూరు, కృష్టాయపా లెం, యర్రబాలెం, తుళ్లూరు మండలంలోని ఐనవోలు, శాఖమూరు, అనంతవరం, దొండపాడు, రాయపూడి గ్రామాలలో పర్యటించి రైతులు, రైతు కూలీలతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు. శనివారం రాజధానిలోని ఆయన పార్టీ కార్యాలయంలో రాజధాని రైతులు, రైతు కూలీలతో ఇతర వర్గాలవారితో పవన్ సమావేశం ఏర్పాటు చేసి, రాజధాని ప్రాంత సమస్యలపై స్పందించనున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..