పంజాబ్:టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు 21 మంది మృతి

- September 04, 2019 , by Maagulf
పంజాబ్:టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు 21 మంది మృతి

పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ టపాసుల ఫ్యాక్టరీలో బుధవారం నాడు చోటు చేసుకొన్న పేలుడులో 21 మంది మృతి చెందారు. ఘటన స్థలంలో ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ నివాస ప్రాంతాల మధ్య ఉందని బోర్డర్ రేంజ్ ఐజీ పర్మార్ తెలిపారు.

ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలను చేపట్టారు. పేలుడు సంబవించిన సమయంలో తొమ్మిది మంది మృతి చెందారు. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో ఉన్న సుమారు 50మందికిపైగా ఈ మంటల్లో చిక్కుకొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com