సైరా నరసింహారెడ్డి సందడి మొదలు కాబోతోంది..
- September 05, 2019
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడుగా చెప్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ సినిమా తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని 250 కోట్లతో నిర్మించారు. బాలీవుడ్ నుంచి అమితాబ్, కన్నడ నుంచి సుదీప్, తమిళ్ నుంచి విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు తమన్నా, జగపతిబాబు, రవి కిషన్ కూడా నటించారు. నయనతార హీరోయిన్ గా నటించింది.
సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదలవుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ బాషల్లో సైరా విడుదలకు రెడీ అవుతోంది. టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలతో సైరాపై అన్ని ఇండస్ట్రీస్ లోనూ బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుందంటున్నారు. దసరా హాలిడేస్ టైమ్ లో ఈ సినిమా వస్తోంది కాబట్టి, భారీ ఓపెనింగ్స్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి అని చెప్పొచ్చు.
సైరా రిలీజ్ కి ఇంకా 25 రోజుల టైమ్ మాత్రమే ఉంది. అందుకే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ నెల 15 లేదా 17న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని, కర్నూల్ లో నిర్వహించనుందని సమాచారం. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు పవన్ కళ్యాణ్, రజనీకాంత్ లను గెస్ట్ లుగా పిలిచే ఆలోచనలో ఉన్నారు. లక్షలాది అభిమానుల మధ్య ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అలాగే బెంగుళూరులోనూ ఓ పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారట. వీటితో పాటు చిరంజీవి అండ్ టీమ్ ముంబయి, బెంగళూరు, కొచ్చి, చెన్నైలలో ప్రమోషన్స్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..