నేటి నుంచి జియో ఫైబర్ సర్వీసులు ప్రారంభం
- September 05, 2019గురువారం నుంచి జియో ఫైబర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. డీటీహెచ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే దిశగా రిలయన్స్ జియో ప్రతి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్పై ఉచితంగా సెట్టాప్ బాక్స్ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. జియోఫైబర్ కస్టమర్లందరికీ కాంప్లిమెంటరీ సెట్టాప్ బాక్స్ కూడా లభిస్తుందని జియో వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.
ఎంటర్టైన్మెంట్ మొబైల్ యాప్స్లోని వీడియో కంటెంట్, సినిమాలు మొదలైనవన్నీ కూడా జియోఫైబర్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటి సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా కలిపే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ చార్జీలు ఉంటాయి. ప్రత్యేకంగా కంటెంట్కు చెల్లించనక్కర్లేదు. ఇక సెట్టాప్కు కెమెరాను అమర్చుకుంటే టీవీ ద్వారా వీడియో కాలింగ్ సేవలు కూడా పొందవచ్చని తెలుస్తోంది.
జియోఫైబర్ కస్టమర్లకు ల్యాండ్లైన్ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్, సెకనుకు 100 మెగాబిట్ నుంచి 1 గిగాబిట్ దాకా స్పీడ్తో బ్రాడ్బ్యాండ్ సేవలు అందనున్నాయి. చార్జీలు నెలకు 700 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. వార్షిక ప్లాన్ తీసుకున్న వారికి ఉచితంగా హెచ్డీ టీవీ సెట్ కూడా అందిస్తామంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ గతంలో వెల్లడించారు. మొత్తం మీద జియోఫైబర్ రాకతో చాలామటుకు డైరెక్ట్ టు హోమ్ సేవలందించే వ్యాపార సంస్థలకు గట్టి దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?