ఓరెడూ మారథాన్లో పాల్గొన్న 2000 మంది
- January 08, 2016
కోర్నిచెలో జరిగిన ఓరెడూ మారథాన్లో 2000 మంది పాల్గొన్నారు. వివిధ వయసులకు చెందినవారు పాల్గొనడంతో మారథాన్ ఉల్లాసభరితంగా సాగింది. ఆరోగ్యం కోసం, అలాగే ఛారిటీ కోసం ఈ మారథాన్ని నిర్వహించారు. ఉదయం 6.30 నిమిషాలకు ప్రారంభమైన ఈ ఫుల్ మారథాన్ 42.195 కిలోమీటర్ల మేర సాగింది. హాఫ్ మారథాన్లో చాలా ఎక్కువమంది కన్పించారు. 10, 5, కిలోమీటర్ల జూనియర్ మరియు అడల్ట్ రేస్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పిల్లల కోసం 3, 1 కిలోమీటర్ల మారథాన్ ఈవెంట్స్ని కూడా నిర్వహించారు. ఫుల్ మారథాన్లో కెన్యాకు చెందినవారు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పురుషులు, స్త్రీల విభాఞగంలో వారికే విన్నింగ్ ఛాన్స్ దక్కింది. 2 గంటల 21 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్న అమోస్ మైంది తొలి స్థానం దక్కించుకున్నారు పురుషుల విభాగంలో. పమేలా చప్కోయెచ్ బుండోటిచ్ మహిళల విభాగంలో 2 గంటల 58 నిమిషాల్లో లక్ష్యం చేరి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







