మిరాకిల్ గార్డెన్ విజిటర్స్ కోసం కొత్త బస్సులు
- January 08, 2016
రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్కి ఊతమివ్వడంలో భాగంగా కొత్త బస్సు సర్వీసులను రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తోంది. ఆర్టీఏ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అదెల్ మహమ్మద్ షక్రి మాట్లాడుతూ, 105 నెంబర్ పేరుతో కొత్త బస్ రూట్ని ఏర్పాటు చేశామన్నారు. షేక్ జాయెద్ రోడ్లోని ఎమిరేట్స్ స్టేషన్ మాల్ నుంచి షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్లోగల మిరాకిల్ గార్డెన్ వరకు ఈ కొత్త సర్వీసు పార్క్ సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. మార్గమధ్యంలో ఎక్కడా ఈ బస్ ఆగకుండా సర్వీసును ఏర్పాటు చేశారు. సాధారణ సర్వీసులకు భిన్నంగా ఈ కొత్త సర్వీస్ ప్రయాణీకుల ఆదరణ పొందుతుందని ఆర్టిఎ వర్గాలు వెల్లడించాయి. ఆది వారం నుంచి గురువారం వరకూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శుక్ర, శని వారాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రారంభించినప్పటి నుంచి 14000 మందికి ఈ సర్వీసు సేవలందించిందనీ, 5 దిర్హామ్లు ఛార్జిగా నిర్ణయించామని అధికారిక వర్గాలు వెల్లడించాయి
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







