పఠాన్కోట్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ..
- January 09, 2016
ప్రధాని నరేంద్ర మోడీ పఠాన్కోట్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎయిర్బేస్పై దాడి జరిగిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించనున్నారు. ఉగ్రవాదుల దాడుల్లో గాయపడిన జవాన్లను మోడీ పరామర్శించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పఠాన్కోట్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా మోడీ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు వెంబడి భద్రతా దళాలు భద్రత కట్టుదిట్టం చేశారు. అనంతరం ఆర్మీ అధికారులతో మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. ఎయిర్బేస్పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఆరుగురు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







