చిరంజీవి కార్యాలయం వద్ద సైరా వంశీయులు ధర్నా
- September 14, 2019తమకు న్యాయం చేయాలంటూ ఉయ్యాలవాడ వంశీ యులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.సైరా నరసింహారెడ్డి సినిమా తీసేందుకు కావలసిన పూర్తి సమాచారంతో పాటు ,సినిమా షూటింగ్ చేసుకునేందుకు అవసరమైన లొకేషన్ లతో పాటు, నరసింహారెడ్డి జీవిత చరిత్రను పూర్తిగా తమనుండి తెలుసుకొన్నారని అన్నారు. సినిమాకు కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకుని షూటింగ్ ను పూర్తి చేసుకొని ఇప్పుడు తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చిరంజీవి తమకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారని కానీ ప్రస్తుతం తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైరా వంశీయులు ధర్నా చేస్తున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు