నవ్ దీప్ సింగ్ సూరికి గురునానక్ దర్బార్ గురుద్వారా దుబాయ్ వీడ్కోలు
- September 14, 2019
దుబాయ్:దుబాయ్లోని గురునానక్ దర్బార్ గురుద్వారా చైర్మన్ సురేందర్ సింగ్ కందారి నేతృత్వంలోని సిక్కు కమ్యూనిటీ, యూఏఈ అంబాసిడర్గా పనిచేసి, పదవీ విరమణ పొందిన నవ్దీప్ సింగ్ సూరిని ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. గురునానక్ దర్బార్ గురుద్వారా దుబాయ్ సిఖ్ టెంపుల్లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. నవ్దీప్ సింగ్ సూరికి సరోపా ప్రెజెంటేషన్తో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. సిక్కు కమ్యూనిటీ, అలాగే ఇండియన్ కమ్యూనిటీ కోసం నవ్దీప్ సింగ్ సూరి చేసిన సేవల్ని ఈ సందర్భంగా వక్తలు గుర్తుచేసుకున్నారు. ప్రవాసీ భారతీయ అవార్డీ మరియు జులేఖా హెల్త్ కేర్ గ్రూప్ ఫౌండర్ ఛెయిర్ పర్సన్ జులేఖా దౌద్ కూడా ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.


తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







