నవ్‌ దీప్‌ సింగ్‌ సూరికి గురునానక్‌ దర్బార్‌ గురుద్వారా దుబాయ్‌ వీడ్కోలు

- September 14, 2019 , by Maagulf
నవ్‌ దీప్‌ సింగ్‌ సూరికి గురునానక్‌ దర్బార్‌ గురుద్వారా దుబాయ్‌ వీడ్కోలు

దుబాయ్‌:దుబాయ్‌లోని గురునానక్‌ దర్బార్‌ గురుద్వారా చైర్మన్‌ సురేందర్‌ సింగ్‌ కందారి నేతృత్వంలోని సిక్కు కమ్యూనిటీ, యూఏఈ అంబాసిడర్‌గా పనిచేసి, పదవీ విరమణ పొందిన నవ్‌దీప్‌ సింగ్‌ సూరిని ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. గురునానక్‌ దర్బార్‌ గురుద్వారా దుబాయ్‌ సిఖ్‌ టెంపుల్‌లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. నవ్‌దీప్‌ సింగ్‌ సూరికి సరోపా ప్రెజెంటేషన్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. సిక్కు కమ్యూనిటీ, అలాగే ఇండియన్‌ కమ్యూనిటీ కోసం నవ్‌దీప్‌ సింగ్‌ సూరి చేసిన సేవల్ని ఈ సందర్భంగా వక్తలు గుర్తుచేసుకున్నారు. ప్రవాసీ భారతీయ అవార్డీ మరియు జులేఖా హెల్త్‌ కేర్‌ గ్రూప్‌ ఫౌండర్‌ ఛెయిర్‌ పర్సన్‌ జులేఖా దౌద్‌ కూడా ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com