మోహన్ లాల్ పై కేసు నమోదు
- September 21, 2019
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పై కేసు నమోదైంది. కేరళ అటవీ శాఖ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఏనుగు దంతపు కళాఖండాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నందుకు మోహన్ లాల్ పై ఈ క్రిమినల్ కేసుకు నమోదైంది. ముందస్తు అనుమతి లేకుండా ఏ వ్యక్తి అయినా ప్రభుత్వ ఆస్తిని కలిగి ఉండటాన్ని వన్యప్రాణుల రక్షణ చట్టం నిషేధిస్తుంది.
2012కు చెందిన ఈ కేసులో పోలీసులు మోహన్ లాల్ నివాసం నుంచి అనేక దంతపు కళాఖండాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3) కింద మోహన్ లాల్ పై కేసు నమోదు చేసినట్లు చార్జిషీట్ సూచిస్తోంది. ప్రభుత్వ సంపదను ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లో పెట్టుకున్నారనే నేరంపై దాఖలైన ఈ చార్జ్ షీట్ పై విచారణ జరిగితే.. మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డట్టేనని చెబుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..