మోహన్ లాల్ పై కేసు నమోదు

- September 21, 2019 , by Maagulf
మోహన్ లాల్ పై కేసు నమోదు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పై కేసు నమోదైంది. కేరళ అటవీ శాఖ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఏనుగు దంతపు కళాఖండాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నందుకు మోహన్ లాల్ పై ఈ క్రిమినల్ కేసుకు నమోదైంది. ముందస్తు అనుమతి లేకుండా ఏ వ్యక్తి అయినా ప్రభుత్వ ఆస్తిని కలిగి ఉండటాన్ని వన్యప్రాణుల రక్షణ చట్టం నిషేధిస్తుంది.

2012కు చెందిన ఈ కేసులో పోలీసులు మోహన్ లాల్ నివాసం నుంచి అనేక దంతపు కళాఖండాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3) కింద మోహన్ లాల్ పై కేసు నమోదు చేసినట్లు చార్జిషీట్ సూచిస్తోంది. ప్రభుత్వ సంపదను ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లో పెట్టుకున్నారనే నేరంపై దాఖలైన ఈ చార్జ్ షీట్ పై విచారణ జరిగితే.. మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డట్టేనని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com