పునరావాసం కోసం ప్రజావాణి లో గల్ఫ్ కార్మికుల ద్దరఖాస్తు
- September 23, 2019
ఒమన్ దేశంలోని హసన్ జుమా బేకర్ అనే భవన నిర్మాణ కంపెనీ జీతం బకాయిలు ఇవ్వకుండానే తమను ఇండియాకు పంపించిందని, తమను ఆదుకోవాలని కామారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు సోమవారం (23.09.2019) కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చిన్నబుర్ర స్వామిగౌడ్, గంగావత్ చందర్, మాచారెడ్డి మండలం ఫరీదుపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ మజీద్, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డికి చెందిన పంపరి గోపాల్, క్యాసంపల్లికి చెందిన విసలావత్ రవి, దోమకొండ మండలం అంఛనూర్ కు చెందిన జోగిని మల్లయ్య ఉన్నారు.
"బయటి దేశాలకు పోయి మోసపోయి వస్తే మేమేం చేయాలి. మీరు క్షేమంగా వాపస్ వచ్చిండ్రు.. అదే సంతోషం. నా కూతురు కూడా అమెరికాకు పోయింది. అక్కడేదో మునిగి వస్తే గవర్నమెంటు ఏం చేస్తది" అని వీరి దరఖాస్తు తీసుకోవడానికి కూడా ప్రజావాణి అధికారి ఇష్టపడలేదు. కార్మికుల వెంట ఉన్న ప్రవాసి మిత్ర మజ్దూర్ యూనియన్ నాయకుడు సురేందర్ సింగ్ ఠాకూర్ జోక్యం చేసుకొని, నీ ముళ్లేమీ పోయింది సారూ.. దరఖాస్తు తీసుకొని ప్రభుత్వానికి పంపియ్యు.. అని అనడంతో వారి దరఖాస్తు స్వీకరించాడు.
తమ కంపెనీ మూతపడటంతో 600 మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఇందులో 45 మంది తెలంగాణ వాసులున్నారని, కామారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురం ఉన్నామని వారు తెలిపారు. గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆర్థికంగా సహాయం చేయాలి, స్వయం ఉపాధి, పునరావాసం కల్పించాలని వారు కోరారు. మాకు ఒక సంవత్సరం జీతం బకాయిలు చెల్లించలేదు. మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ వారికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి అక్కడి లేబర్ కోర్టులో జీతం బకాయిల కోసం కేసు వేశాము. మాకు ఒక్కొక్కరికి రూ.1 లక్షా 50 వేల నుండి రూ. 2 లక్షల 50 వేల వరకు జీతం బకాయిలు రావాల్సి ఉన్నదని వారు తెలిపారు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చితికిపోయి ఉన్నాము. గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆర్థికంగా సహాయం చేయాలి, స్వయం ఉపాధి, పునరావాసం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







