మలేషియా బాధితులను ఆదుకున్న APNRTS సంస్థ
- September 29, 2019
విశాఖపట్నం: బతుకుదెరువు కోసం మలేషియా వెళ్ళి ఏజెంట్ల చేతిలో మోస పోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వ సాయంతో ఏపీ నాన్రెసిడెంట్ తెలుగు సొసైటీ తిరిగి సొంత గ్రామాలకు తీసుకువస్తోంది. అనేక కారణాలతో మోసపోయిన 200 మందితో ఈ సంస్థ సంప్రదించింది. వీరిలో తొలి విడతగా 18 మందికి మలేషియా ప్రభుత్వానికి ఈ సంస్థ జరిమానా చెల్లించడమే కాకుండా విమాన టికెట్లు కొనుగోలు చేసింది. వీరంతా ఆదివారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి రానున్నారు. ఇక్కడ నుంచి వారి సొంత ఊళ్లకు వెళ్లడానికి ఏర్పాట్లు చేశామని సంస్థ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. ఎవరైనా సంప్రదించాలంటే 0863-2340678, 8500027678కు ఫోన్ చేయాలన్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







