షాకింగ్.. ఏపీలో రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధర.. రూ.30
- September 29, 2019
దసరా సెలవుల్లో బాదుడుకు సిద్ధమైంది రైల్వే శాఖ.. ఏపీలో పది రోజులకు పైగా దసరా సెలవులు రావడంతో.. అంతా సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీని క్యాష్ చేసేకునేందుకు స్కెచ్ వేసింది రైల్వే శాఖ. ఫ్లాట్ఫాం టికెట్లను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం పది రూపాయలు ఉన్న ప్లాట్ ఫాం టికెట్ ధరను 30 రూపాయలకు పెంచేసింది.
విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు స్టేషన్లో అమలుకు సిద్ధమైంది. రేపటి నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు.. అంటే దసరా సెలవులు ముగిసే వరకు.. ఈ పెరిగిన ధరలకే ఫ్లాట్ ఫాం టికెట్లను విక్రయించనుంది.. దీనిపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడంతో.. రద్దీని నియంత్రించేందుకే రేట్లు పెంచామంటోంది రైల్వే శాఖ.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







