ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్:ఏ.పి
- September 30, 2019
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియమాక పత్రాలు అందజేశారు సీఎం జగన్. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడకుండా పని చేయాలని గ్రామ వాలంటీర్లకు సూచించారు సీఎం జగన్. గ్రామ సచివాలయ వ్యవస్థను విజయవంతంగా పూర్తి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని అన్నారు జగన్.
ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇచ్చామన్న ముఖ్యమంత్రి… ఉద్యోగాల చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు అని చెప్పారు. ఇకపై ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని.. అదే నెల చివరి కల్లా నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు జగన్.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప.. వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







