ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్:ఏ.పి
- September 30, 2019
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియమాక పత్రాలు అందజేశారు సీఎం జగన్. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడకుండా పని చేయాలని గ్రామ వాలంటీర్లకు సూచించారు సీఎం జగన్. గ్రామ సచివాలయ వ్యవస్థను విజయవంతంగా పూర్తి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని అన్నారు జగన్.
ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇచ్చామన్న ముఖ్యమంత్రి… ఉద్యోగాల చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు అని చెప్పారు. ఇకపై ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని.. అదే నెల చివరి కల్లా నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు జగన్.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప.. వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!