ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్:ఏ.పి
- September 30, 2019ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియమాక పత్రాలు అందజేశారు సీఎం జగన్. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడకుండా పని చేయాలని గ్రామ వాలంటీర్లకు సూచించారు సీఎం జగన్. గ్రామ సచివాలయ వ్యవస్థను విజయవంతంగా పూర్తి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని అన్నారు జగన్.
ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇచ్చామన్న ముఖ్యమంత్రి… ఉద్యోగాల చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు అని చెప్పారు. ఇకపై ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని.. అదే నెల చివరి కల్లా నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు జగన్.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప.. వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక