బిచ్చగాడు నిర్మాత తనయుడు హీరోగా 'వలయం'
- October 02, 2019
బిచ్చగాడు , డి 16, టిక్ టిక్ టిక్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పలు చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్. ఈ బ్యానర్పై చదలవాడ శ్రీనివాసరావు పలు హిట్ చిత్రాలని రూపొందించారు. ఇప్పుడు ఆయన తనయుడు లక్ష్ చదలవాడ హీరోగా సినిమా చేస్తున్నారు. హిప్పీ ఫేమ్ దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రవిప్రకాశ్, రవి వర్మ, నోయెల్ సేన్, చిత్రం శ్రీను తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. వలయం అనే టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ ఆసక్తిని కలిగిస్తుంది. ఫిబ్రవరి 2020లో సినిమా విడుదల కానుంది. చదలవాడ లక్ష్మణ్ కెరీర్ ప్రారంభంలో హీరోగా రాణించాలనుకున్నారు. ఒకట్రెండు సినిమాలు కూడా చేశారు. అయితే అవేవీ హిట్ కాకపోవడంతో లక్ష్మణ్ అలియాస్ లక్ష్ సైలెంట్గా ఉండిపోయాడు. తాజాగా.. మరోసారి లక్ష్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







