యూఏఈ వెళ్ళకుండానే 12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- October 04, 2019
యూఏఈ:ఇప్పటిదాకా ఎప్పుడూ యూఏఈ వెళ్ళని ఓ వ్యక్తి, అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బిగ్ టికెట్ రఫాలె డ్రాలో 12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. కేరళకు చెందిన 24 ఏళ్ళ మొహమ్మద్ ఫయాజ్, ఇండియన్ ఫైనాన్షియల్ సిటీ ముంబైలో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. తన స్నేహితుడి సూచనతో టిక్కెట్లను కొనడం ప్రారంభించాననీ, ఈ క్రమంలోనే తనకు ఈ బహుమతి లభించిందనీ చెప్పారాయన. అనారోగ్య కారణాలతో తన తండ్రి, తన తల్లి కొంత కాలం క్రితం ప్రాణాలు కోల్పోయారనీ, తన తండ్రి సౌదీ అరేబియాలో పనిచేశారనీ చెప్పారు మొహమ్మద్ ఫయాజ్. గెలిచిన సొమ్ముతో తన ఇంటిని నిర్మించుకుంటాననీ, అలాగే కొంత ఛారిటీ వర్క్ కూడా చేస్తాననీ అంటున్నారీ విజేత.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







