యూఏఈ వెళ్ళకుండానే 12 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్‌

- October 04, 2019 , by Maagulf
యూఏఈ వెళ్ళకుండానే 12 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్‌

యూఏఈ:ఇప్పటిదాకా ఎప్పుడూ యూఏఈ వెళ్ళని ఓ వ్యక్తి, అబుదాబీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద జరిగిన బిగ్‌ టికెట్‌ రఫాలె డ్రాలో 12 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్నారు. కేరళకు చెందిన 24 ఏళ్ళ మొహమ్మద్‌ ఫయాజ్‌, ఇండియన్‌ ఫైనాన్షియల్‌ సిటీ ముంబైలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. తన స్నేహితుడి సూచనతో టిక్కెట్లను కొనడం ప్రారంభించాననీ, ఈ క్రమంలోనే తనకు ఈ బహుమతి లభించిందనీ చెప్పారాయన. అనారోగ్య కారణాలతో తన తండ్రి, తన తల్లి కొంత కాలం క్రితం ప్రాణాలు కోల్పోయారనీ, తన తండ్రి సౌదీ అరేబియాలో పనిచేశారనీ చెప్పారు మొహమ్మద్‌ ఫయాజ్‌. గెలిచిన సొమ్ముతో తన ఇంటిని నిర్మించుకుంటాననీ, అలాగే కొంత ఛారిటీ వర్క్‌ కూడా చేస్తాననీ అంటున్నారీ విజేత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com